వారిని ఎప్పటికీ మరిపోలేము అంటున్న ఎన్టీఆర్ !!!
అభిమానులు, ప్రేక్షకులు, ‘జనతా గ్యారేజ్’ చిత్ర బృందం చేసిన సపోర్ట్ మర్చిపోలేనిదని హీరో ఎన్టీఆర్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ‘50 రోజులకు చేరింది! ఇలాంటి గొప్ప విజయాన్ని అందించినందుకు అందరికీ ధన్యవాదాలు, కొరటాల శివకు పెద్ద థ్యాంక్స్. మీ దృష్టి, సంపూర్ణ ధృడ నిశ్చయం మా అందరికీ విక్టరీని అందించింది. ‘జనతా గ్యారేజ్’ చిత్ర బృందం, అభిమానులు, ప్రేక్షకులు, మీడియా, శ్రేయోభిలాషులు ఇచ్చిన సపోర్ట్ను మర్చిపోలేను.. ధన్యవాదాలు!’ అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సమంత, నిత్యా మేనన్ కథానాయికలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
అభిమానులు, ప్రేక్షకులు, ‘జనతా గ్యారేజ్’ చిత్ర బృందం చేసిన సపోర్ట్ మర్చిపోలేనిదని హీరో ఎన్టీఆర్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ‘50 రోజులకు చేరింది! ఇలాంటి గొప్ప విజయాన్ని అందించినందుకు అందరికీ ధన్యవాదాలు, కొరటాల శివకు పెద్ద థ్యాంక్స్. మీ దృష్టి, సంపూర్ణ ధృడ నిశ్చయం మా అందరికీ విక్టరీని అందించింది. ‘జనతా గ్యారేజ్’ చిత్ర బృందం, అభిమానులు, ప్రేక్షకులు, మీడియా, శ్రేయోభిలాషులు ఇచ్చిన సపోర్ట్ను మర్చిపోలేను.. ధన్యవాదాలు!’ అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సమంత, నిత్యా మేనన్ కథానాయికలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
0 comments:
Post a Comment