అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది....ఒక అనామకుడు హీరో అవ్వటం ఏంటి....
ఈరోజుల్లో సినిమా పరిశ్రమలలో చాన్స్ దొరకాలంటే చాలా కస్టం.....అది కాక ఒక అనామకుడు సినీపరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు బర్నింగ్స్టార్ సంపూర్ణేష్ బాబు. తెలంగాణలోని సిద్ధిపేటలో జన్మించిన సంపూ సోషల్మీడియా ద్వారా రాష్ట్రేతరంగా కూడా పేరు సంపాదించుకున్నాడు. గాలి జనార్ధన్రెడ్డిని(గనుల శాఖ మంత్రి ఒకప్పుడు) అతడి నివాసంలోనే సంపూ కలవడం అందుకు ఒక చిన్న ఉదాహరణ. కోట్లకు అధిపతి అయిన గాలిజనార్ధన్రెడ్డి.. సంపూకి ఆతిథ్యం ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సంపూతో గాలి సినిమా తీస్తాడని అప్పట్లో అందరూ అనుకున్నారు. తెలుగు ప్రేక్షకుల దురదృష్టవశాత్తూ అలాంది ఏమీ జరగలేదు.
అసలు ఏం జరుగుతుంది...తారక్ గురించి ఇంతలా అంటే..చరిత్రలో నిలిచిపోయే హీరో తారక్..
ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా సంపూర్ణేష్ బాబు చేసిన ఓ పని సోషల్మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ముద్దుల కూతురి వివాహవేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించేందుకు గాలిజనార్ధన్రెడ్డి హైదరాబాద్ వచ్చారు. కొంతమంది హీరోలకు ఆహ్వానపత్రికలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బర్నింగ్స్టార్కు గాలివారి భారీ ఆహ్వాన పత్రిక అందింది. ఆ విషయాన్ని సంపూర్ణేష్ బాబు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. ‘గాలి జనార్ధన్ రెడ్డి గారి అమ్మాయి వివాహ పత్రిక అందుకోవటం సంతోషకరమైన విషయం. ఆ కుటుంబం నా పైన చూపించే ప్రేమాభిమానాలకు నేనెప్పుడూ బానిసను’ అంటూ ఆహ్వాన పత్రిక అందుకుంటున్న ఫొటోను సోమవారం రాత్రి పోస్ట్ చేశాడు. అయితే మంగళవారం ఉదయం సంపూ ఆ పోస్ట్ను డిలీట్ చేశాడు. ఈ విషయంపై ఇప్పుడు సోషల్మీడియాలో పెద్ద దుమారమే నడుస్తోంది. రాత్రికిరాత్రే సంపూర్ణేష్ బాబు ఆ పోస్ట్ను తీసేయాడానికి కారణమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అసలు గాలి జనార్ధన్ రెడ్డి కి , సంపూకి వున్న సంబంధం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా, కర్ణాటకలోని బళ్లారి జిల్లాల మధ్య ఉన్న గనులను అప్పట్లో గాలిజనార్ధన్రెడ్డికి కట్టబెట్టారు. దాంతో గాలి కోటీశ్వరుడయ్యాడు. బంగారు పళ్లెం, బంగారు కుర్చీ.. ఆఖరికి బంగారు టాయిలెట్ వాడే రేంజ్కు ఎదిగాడు గాలి జనార్ధన్రెడ్డి. అయితే వైఎస్ అకాల మరణం తర్వాత గాలిజనార్ధన్రెడ్డిపై సీబీఐ, ఏసీబీ, ఐటీ అధికారులు ఒక్కసారిగా గాలిపై విరుచుకుపడ్డారు. గాలికే ఊపిరాడనంత పని చేశారు. ఎట్టకేలకు గాలిని జైల్లో పెట్టారు. అయితే ఆ గత ఏడాది సెప్టెంబర్లో బెయిల్పై గాలి బయటకొచ్చాడు. ఆ సమయంలో అత్యంత ఆప్తులు కూడా గాలిని కలిసే సాహసం చేయలేదు. కానీ మన బర్నింగ్స్టార్ ఆ సాహసం చేశారు. గాలిని కలిసినట్లు 2015 సెప్టెంబర్ 15న ట్వీట్ చేశారు. అప్పుడప్పుడే ఒకే ఒక్క సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ చేసిన సంపూ, ఆ క్షణంలో గాలిని కలవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సంపూతో గనుల ఘనుడికి ఉన్న సంబంధం ఏమిటని అందరూ సందేహం వ్యక్తం చేశారు. కొద్ది రోజులు చర్చించుకుని ఆ విషయం మర్చిపోయారు. అయితే తాజా ఘటన పాత విషయాన్ని కూడా గుర్తు చేస్తూ.. చర్చలకు తావిస్తోంది. ఎవరెన్ని రకాలుగా చెప్పినా... ఈ విషయంపై అటు గాలి కానీ, ఇటు సంపూ కానీ స్పందిస్తే తప్ప వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది అంత కచ్చితంగా చెప్పలేం. కుమార్తె వివాహ వేడుకలో గాలి బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ విషయంపై సంపూనే స్పందిస్తాడేమో చూడాలి.
ఈరోజుల్లో సినిమా పరిశ్రమలలో చాన్స్ దొరకాలంటే చాలా కస్టం.....అది కాక ఒక అనామకుడు సినీపరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు బర్నింగ్స్టార్ సంపూర్ణేష్ బాబు. తెలంగాణలోని సిద్ధిపేటలో జన్మించిన సంపూ సోషల్మీడియా ద్వారా రాష్ట్రేతరంగా కూడా పేరు సంపాదించుకున్నాడు. గాలి జనార్ధన్రెడ్డిని(గనుల శాఖ మంత్రి ఒకప్పుడు) అతడి నివాసంలోనే సంపూ కలవడం అందుకు ఒక చిన్న ఉదాహరణ. కోట్లకు అధిపతి అయిన గాలిజనార్ధన్రెడ్డి.. సంపూకి ఆతిథ్యం ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సంపూతో గాలి సినిమా తీస్తాడని అప్పట్లో అందరూ అనుకున్నారు. తెలుగు ప్రేక్షకుల దురదృష్టవశాత్తూ అలాంది ఏమీ జరగలేదు.
అసలు ఏం జరుగుతుంది...తారక్ గురించి ఇంతలా అంటే..చరిత్రలో నిలిచిపోయే హీరో తారక్..
ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా సంపూర్ణేష్ బాబు చేసిన ఓ పని సోషల్మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ముద్దుల కూతురి వివాహవేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించేందుకు గాలిజనార్ధన్రెడ్డి హైదరాబాద్ వచ్చారు. కొంతమంది హీరోలకు ఆహ్వానపత్రికలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బర్నింగ్స్టార్కు గాలివారి భారీ ఆహ్వాన పత్రిక అందింది. ఆ విషయాన్ని సంపూర్ణేష్ బాబు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. ‘గాలి జనార్ధన్ రెడ్డి గారి అమ్మాయి వివాహ పత్రిక అందుకోవటం సంతోషకరమైన విషయం. ఆ కుటుంబం నా పైన చూపించే ప్రేమాభిమానాలకు నేనెప్పుడూ బానిసను’ అంటూ ఆహ్వాన పత్రిక అందుకుంటున్న ఫొటోను సోమవారం రాత్రి పోస్ట్ చేశాడు. అయితే మంగళవారం ఉదయం సంపూ ఆ పోస్ట్ను డిలీట్ చేశాడు. ఈ విషయంపై ఇప్పుడు సోషల్మీడియాలో పెద్ద దుమారమే నడుస్తోంది. రాత్రికిరాత్రే సంపూర్ణేష్ బాబు ఆ పోస్ట్ను తీసేయాడానికి కారణమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అసలు గాలి జనార్ధన్ రెడ్డి కి , సంపూకి వున్న సంబంధం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా, కర్ణాటకలోని బళ్లారి జిల్లాల మధ్య ఉన్న గనులను అప్పట్లో గాలిజనార్ధన్రెడ్డికి కట్టబెట్టారు. దాంతో గాలి కోటీశ్వరుడయ్యాడు. బంగారు పళ్లెం, బంగారు కుర్చీ.. ఆఖరికి బంగారు టాయిలెట్ వాడే రేంజ్కు ఎదిగాడు గాలి జనార్ధన్రెడ్డి. అయితే వైఎస్ అకాల మరణం తర్వాత గాలిజనార్ధన్రెడ్డిపై సీబీఐ, ఏసీబీ, ఐటీ అధికారులు ఒక్కసారిగా గాలిపై విరుచుకుపడ్డారు. గాలికే ఊపిరాడనంత పని చేశారు. ఎట్టకేలకు గాలిని జైల్లో పెట్టారు. అయితే ఆ గత ఏడాది సెప్టెంబర్లో బెయిల్పై గాలి బయటకొచ్చాడు. ఆ సమయంలో అత్యంత ఆప్తులు కూడా గాలిని కలిసే సాహసం చేయలేదు. కానీ మన బర్నింగ్స్టార్ ఆ సాహసం చేశారు. గాలిని కలిసినట్లు 2015 సెప్టెంబర్ 15న ట్వీట్ చేశారు. అప్పుడప్పుడే ఒకే ఒక్క సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ చేసిన సంపూ, ఆ క్షణంలో గాలిని కలవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సంపూతో గనుల ఘనుడికి ఉన్న సంబంధం ఏమిటని అందరూ సందేహం వ్యక్తం చేశారు. కొద్ది రోజులు చర్చించుకుని ఆ విషయం మర్చిపోయారు. అయితే తాజా ఘటన పాత విషయాన్ని కూడా గుర్తు చేస్తూ.. చర్చలకు తావిస్తోంది. ఎవరెన్ని రకాలుగా చెప్పినా... ఈ విషయంపై అటు గాలి కానీ, ఇటు సంపూ కానీ స్పందిస్తే తప్ప వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది అంత కచ్చితంగా చెప్పలేం. కుమార్తె వివాహ వేడుకలో గాలి బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ విషయంపై సంపూనే స్పందిస్తాడేమో చూడాలి.
0 comments:
Post a Comment