ఇది వింటే నిరుద్యోగులు ఆనందానికి హద్దులుండవు.....త్వరలోనే అధికారిక ప్రకటన....
ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచం లో ఉద్యోగాలు దొరకటం చాలా కస్టతరం తో కూడుకున్న పని...ఒక వేల దొరికినా అది ఎప్పుడు వుంటుందో ఊడిపోతుందో సరిగ్గ తెలీదు..అందుకే చాలా మంది పోటీ పడి మరి ప్రభుత్వ పరీక్షలకు చదివి చదివి.. సకాలంలో ఉద్యోగ ప్రకటనలు రాక.. వయో పరిమితి దాటిపోయిందని బాధపడుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచాలని సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. వాస్తవానికి ఉద్యోగ దరఖాస్తు వయోపరిమితి గత ఏడాది వరకు 34 ఏళ్లుగా ఉండేది. దానిని 40 ఏళ్లకు పెంచుతూ ఏడాది క్రితం ఉత్తర్వులు ఇచ్చారు. ఒక ఏడాదిపాటు అవి అమల్లో ఉన్నాయి. ఆ గడువు ముగిశాక ఇటీవలే మరో ఏడాదిపాటు 40ఏళ్ల వయోపరిమితి నిబంధన ఉండేలా పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులిచ్చారు. గత కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాలు పడలేదని, ఈ నేపథ్యంలో వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచాలని రాష్ట్రంలోని నిరుద్యోగులు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయించింది. త్వరలో విడుదల చేయబోయే గ్రూప్-2 ఉద్యోగాల నోటిఫికేషన్తో పాటు, ఇతర ఉద్యోగాలకూ దీన్ని వర్తింపచేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు బుధవారం కొందరు అధికారులతో మాట్లాడారు. పెంచాలా.. వద్దా అని అన్ని కోణాల్లోనూ చర్చించారు. చివరకు వయో పరిమితి పెంపుపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
నిజం గ ఇది నిరుద్యోగుల పాలిట వరం గా చెప్పుకోవచ్చు....
0 comments:
Post a Comment